రంజాన్ చివ‌రి శుక్ర‌వారం నేప‌థ్యంలో మీర్ ఆలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు

Special prayers held at Mir Alam Eidgah. శుక్రవారం ఓల్డ్ సిటీలోని మక్కా మసీదు మీర్ ఆలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు

By Medi Samrat  Published on  29 April 2022 9:20 AM GMT
రంజాన్ చివ‌రి శుక్ర‌వారం నేప‌థ్యంలో మీర్ ఆలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు

శుక్రవారం ఓల్డ్ సిటీలోని మక్కా మసీదు మీర్ ఆలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చార్మినార్, పాతబస్తీ, మీర్ ఆలం ఈద్గా, మక్కా మసీదు వద్ద పటిష్ట భద్రతను పాటించారు. పాతబస్తీలోని ఈద్గా వద్ద శుక్రవారం నమాజ్ స‌మ‌యంలో రద్దీ ఎక్కువ‌గా కనిపించింది.

మీర్ ఆలం ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లించబడింది. రంజాన్ పండుగ సమీపిస్తున్నందున చార్మినార్ పాతబస్తీ ప్రాంతం సాయంత్రం సమయాల్లో పూర్తిగా రద్దీగా ఉంటుంది. ముస్లిం కమ్యూనిటీ సాయంత్రం ఆరు గంట‌ల‌కు ఉపవాసాన్ని విరమించుకుంటారు. మే మొదటి వారంలో రంజాన్ పండుగ ఉండ‌టంతో షాపింగ్ చేసే అవకాశం కూడా ఉంది.

ఇదిలావుంటే.. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఇఫ్తార్ విందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ క్యాడర్‌ ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారని, ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందన్నారు. ఈ ఇఫ్తార్ విందు ఆనవాయితీని ప్రభుత్వం ఎప్పటి నుంచో కొనసాగిస్తోంది.

Next Story