డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, మరో ముగ్గురు అరెస్ట్
ఎస్ఆర్ నగర్లో తన స్నేహితుడికి డ్రంకెన్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకున్నందుకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 14 Nov 2024 9:08 AM IST
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, మరో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్లో తన స్నేహితుడికి డ్రంకెన్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించగా పోలీసులను అడ్డుకున్న సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతనితో పాటు ప్రయాణిస్తున్న ముగ్గురు సహచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఏసీపీ సుమన్ కుమార్, వ్యాపారి జైపాల్ రెడ్డి, మరో ఇద్దరు సహచరులు సఫారీ వాహనంలో అమీర్పేట నుంచి ఎస్ఆర్నగర్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఎస్ఆర్నగర్ మెట్రో స్టేషన్కు చేరుకోగానే సంజీవ్రెడ్డి నగర్కు చెందిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీ చేయడం గమనించారు. ఇబ్బందిని గ్రహించి, కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో వెనుక సీటుకు వెళ్లాడు. మరొక ప్రయాణికుడు డ్రైవర్ సీటుకు మారాడు.
డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ కావేరి సీటు మార్పిడిని గమనించి, అసలు డ్రైవర్ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అనుమానించి పోలీసు అధికారులను అప్రమత్తం చేసింది.
సీటు మారిన డ్రైవర్కు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించేందుకు ట్రాఫిక్ పోలీసులు కారును ఆపడంతో ఏసీపీ సుమన్కుమార్ కారు దిగి అధికారులు విధులు నిర్వర్తించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరీక్ష నిర్వహించకుండా వాహనాన్ని విడుదల చేయాలని పోలీసులకు చెప్పాడు. అసలు డ్రైవర్ని బ్రీత్ ఎనలైజర్ పరీక్ష రానీయకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్లో ఒకరిని శారీరకంగా నెట్టాడు. కారు బానెట్ను కొట్టాడు. అధికారులను దూషించాడు. దీంతో సంఘటనా స్థలంలో గందరగోళం ఏర్పడింది.
పరిస్థితి చేయిదాటిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు మధురానగర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. మధురా నగర్కు చెందిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా జైపాల్ రెడ్డి అనే వ్యాపారి మద్యం మత్తులో 39 పాయింట్లు అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు.
అనంతరం అతడు అల్వాల్కు చెందిన జైపాల్రెడ్డి అనే వ్యాపారిగా గుర్తించారు. ఏసీపీ సుమన్ కుమార్తో పాటు ఇద్దరు సహచరులు ఎం.శ్రీనివాస్, జి.వెంకటరావులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని, సంజీవ్ రెడ్డి నగర్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జి. కాంతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 132, 238, 221 ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్ఎస్, 185, 188, కింద కేసు నమోదు చేశారు. మోటారు వాహన చట్టంలోని 205 ప్రకారం మధురా నగర్ పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.