సికింద్రాబాద్ హింసాకాండ కేసులో కీల‌క ప‌రిణామం

Secunderabad Violence Coaching Center Owner Handed Over to GRP for Investigation. సికింద్రాబాద్ హింసాకాండ నిందితుడు ఆవుల సుబ్బారావును ఆంధ్రప్రదేశ్

By Medi Samrat  Published on  22 Jun 2022 6:33 AM GMT
సికింద్రాబాద్ హింసాకాండ కేసులో కీల‌క ప‌రిణామం

సికింద్రాబాద్ హింసాకాండ నిందితుడు ఆవుల సుబ్బారావును ఆంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైల్వే పోలీసులకు (జిఆర్‌పి) విచారణ నిమిత్తం అప్పగించింది. సాయి డిఫెన్స్‌ అకాడమీ అధినేత రావును నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు.

'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందలాది మంది ఉద్యోగ ఆశావహులు విధ్వంసానికి పాల్పడిన విషయం గుర్తుండే ఉంటుంది. కొన్ని కోచింగ్‌ సెంటర్లు వాట్సాప్‌ గ్రూపులు సృష్టించి కొన్ని మెసేజ్‌లు పంపడంతో యువత రెచ్చిపోయింది. సుబ్బారావుకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండింటిలోనూ దాదాపు 16 కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. యువతను నిరసనలకు ప్రేరేపించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా దాదాపు 800 మంది యువతను రెచ్చగొట్టారు. ఈ గ్రూపుల ద్వారా సుబ్బారావు వాయిస్ మెసేజ్‌లు ప్రచారంలోకి వచ్చాయి. నిరసనలు చెలరేగడానికి ఒక రోజు ముందు యువకులు సికింద్రాబాద్‌లో బస చేశారు. సుబ్బారావు వారందరికీ భోజనం, వసతి కల్పించారు. బుధవారం సుబ్బారావును జీఆర్పీ విచారించనుండగా, రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

యువకుడి ఆత్మహత్యాయత్నం

సికింద్రాబాద్‌ నిరసనల్లో భాగంగా వరంగల్‌కు చెందిన ఓ యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడినందుకు పోలీసులు తనపై కేసు నమోదు చేస్తారని గోవింద్ అజయ్ భయపడ్డాడు. దీంతో ఆత్మహత్యకు యత్నించాడు. గోవింద్‌ను చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.













Next Story