రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్లో జరిగిన బర్త్డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ సార్టీకి మాజీ వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన సతీమణి మాధురి హజరయ్యారు. ఈ బర్త్ డే పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు నిలిపివేశారు. పార్థసారథి అనే వ్యక్తి జన్మదిన వేడుక జరుపుకోవడానికి పోలీసుల నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోవడంతోనే ఈ ఫామ్ హౌస్పై దాడి చేసినట్లు తెలుస్తుంది.
బర్త్ డే పార్టీకి దువ్వాడ దంపతులతో పాటు మరో 25 మంది కూడా హాజరయ్యారు. ఈ పార్టీలో మద్యంతో పాటు హుక్కా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీపై విశ్వసనీయమైన సమాచారం మేరకు రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందం ఫామ్ హౌస్పై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న వారందరికి నోటీసులిచ్చినట్లు తెలుస్తుంది. అనుమతి లేకపోవడంతో 10 మద్యం బాటిళ్లు, 5 హుక్కా పాట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫాం హౌస్ యజమాని సుభాష్, పార్టీ నిర్వహించిన పార్థసారధి, హుక్కా సప్లయర్ రియాజ్, మరో నలుగురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.