జార్జిరెడ్డి 51వ వర్ధంతి.. నివాళులర్పించిన‌ పీడీఎస్‌యూ సభ్యులు, విద్యార్థులు

PDSU members, students pay tributes to George Reddy on his death anniversary. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి 51వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం

By Medi Samrat  Published on  14 April 2023 2:02 PM GMT
జార్జిరెడ్డి 51వ వర్ధంతి.. నివాళులర్పించిన‌ పీడీఎస్‌యూ సభ్యులు, విద్యార్థులు

PDSU members, students pay tributes to George Reddy on his death anniversary


ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి 51వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం క్యాంపస్‌లో ఆర్ట్స్ కళాశాల భవనం నుంచి కిన్నెర హాస్టల్ వరకు ప్రత్యేక పాదయాత్రలో సామాజిక కార్యకర్తలు, మాజీ సహచరులు, విద్యార్థి నాయకులు, పీడీఎస్‌యూ సభ్యులు పాల్గొన్నారు. యువ నాయకుడిగా జార్జిరెడ్డి పాత్రను, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల రాజకీయాలతో ఆయనకున్న అనుబంధాన్ని కార్యక్రమంలో పాల్గొన్నవారు గుర్తు చేసుకున్నారు.

జార్జ్ రెడ్డి ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో టాపర్. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. అతను మార్క్సిస్ట్ భావజాలంతో ప్రభావితమయ్యాడు. సామాజిక వివక్ష, సామాజిక అసమానతలను గట్టిగా వ్యతిరేకించాడు. అతను లింగ సమానత్వాన్ని విశ్వసించాడు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా బలహీనమైన వర్గాలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడాడని పీడీఎస్‌యూ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 14, 1972న అతనిపై దాడి జ‌రిగిన‌ కిన్నెర హాస్టల్ దగ్గర పాదయాత్ర ముగిసింది. మేధావులు, విద్యార్థి కార్యకర్తలు, ఇతరులు సంస్మరణ సభకు హాజరయ్యారు. మాజీ స్టూడెంట్స్ కమిటీ కన్వీనర్ గురువారెడ్డి, కో-కన్వీనర్ డాక్టర్ కొండా నాగేశ్వర్, అరుణోదయ విమలక్క త‌దిత‌రులు పాల్గొన్నారు.


Next Story