విద్యార్ధుల కోసం భారీ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన‌ పటాన్‌చెరు ఎమ్మెల్యే

Patancheru MLA to distribute note books to 33,000 govt school students. జూన్‌ నెల వచ్చిందంటే చాలు.. ట్యూషన్ ఫీజులు, పాఠశాల పుస్తకాలు,

By Medi Samrat  Published on  17 July 2022 12:42 PM GMT
విద్యార్ధుల కోసం భారీ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన‌ పటాన్‌చెరు ఎమ్మెల్యే

జూన్‌ నెల వచ్చిందంటే చాలు.. ట్యూషన్ ఫీజులు, పాఠశాల పుస్తకాలు, నోట్‌పుస్తకాల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. మిడిల్ క్లాస్, పేద ప్రజలు చాలా రోజుల నుండి పిల్లల అవసరాల కోసం కూడబెడుతూ ఉంటారు. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్‌లు, పలకలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని పాఠశాలల మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులను సంప్రదించిన అనంతరం పటాన్‌చెరు ఎమ్మెల్యే ఒక్కో తరగతికి ఒక సెట్‌ను సిద్ధం చేశారు.

పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 108 ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 33,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మహిపాల్‌రెడ్డి కోటి రూపాయలకు పైగా వెచ్చించి 2.30 లక్షల నోట్లు పుస్తకాలు కొనుగోలు చేశారు. నియోజకవర్గంలోని అంగన్‌వాడీల్లో 6,500 మంది చిన్నారులు అడ్మిట్‌ అయినందున అక్షరాలు, సంఖ్యలతో కూడిన స్లేట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. వీరితో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు, డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు నోట్‌బుక్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే రూ.కోటి ఖర్చు చేశారు.










Next Story