నీరు, విద్యుత్‌ కొరత.. ఓయూ హాస్టళ్ల మూసివేత.. డిప్యూటీ సీఎం ఏమన్నారంటే?

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో నీటి కొరతను నిరసిస్తూ విద్యార్థులు ఇటీవల ఆందోళన నిర్వహించారు.

By అంజి  Published on  29 April 2024 3:27 PM GMT
Osmania University, hostels, protest, water shortage, Hyderabad

నీరు, విద్యుత్‌ కొరత.. ఓయూ హాస్టళ్ల మూసివేత.. డిప్యూటీ సీఎం ఏమన్నారంటే?

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో నీటి కొరతను నిరసిస్తూ విద్యార్థులు ఇటీవల ఆందోళన నిర్వహించారు. తదనంతరం, విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ వేసవి సెలవులు కారణంగా హాస్టళ్లు, మెస్ సౌకర్యాలను మూసివేస్తూ ప్రకటన జారీ చేసింది. అకడమిక్ క్యాలెండర్‌లో భాగంగా, విశ్వవిద్యాలయం మే 1 నుండి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించింది. అయితే నోటీసులో ఇలా ఉంది ''తీవ్రమైన వేసవి కారణంగా, హాస్టళ్లలో నీరు, విద్యుత్ కొరత ఉంది. బోర్డర్లందరూ వర్సిటీకి సహకరించాలని కోరారు'' ఈ మేరకు యూనివర్సిటీ విద్యార్థులందరికీ చీఫ్ వార్డెన్ నోటీసులు జారీ చేశారు.

మరోవైపు ఓయూలో నీళ్లు, విద్యుత్‌ కొరతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పారు. విద్యుత్‌, తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ''వేసవి సెలవుల్లో హాస్టళ్లలో ఉండే వివిధ రాష్ట్రాలు, దేశాల విద్యార్థులు తమ గదులను ఖాళీ చేయమని కోరడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్‌ నీరు అందించదు'' అని అన్నారు. నీటి ఎద్దడిపై విద్యార్థులు ఆందోళన చేస్తూ యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఐదు రోజులుగా నీటి ఎద్దడి నెలకొందని వాపోయారు. మాకు రోజుకు ఒక గంట నీరు అందుతుందని విద్యార్థులు తెలిపారు.

నిరసనలో ఉన్న విద్యార్థి ఒకరు విలేకరులతో మాట్లాడుతూ.. ''మేము ప్రతిరోజూ నీటి గురించి ఫిర్యాదు చేశాము. భూగర్భ జలాలు లేవని, భూమిలో నీరు లేకుంటే నీటి ట్యాంకులు తదితర ప్రత్యామ్నాయాలను వెతకాలని వారు అంటున్నారు. నీటిని వృథా చేయవద్దని డైరెక్టర్లు సూచిస్తున్నారు. మేం స్నానం చేయకూడదా, బట్టలు ఉతుక్కోకూడదా, నీరు తాగకూడదా? మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరు కావాలి''

Next Story