పంజాగుట్ట కూడ‌లిలో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మంత్రి కేటీఆర్

Minister KTR unveils statue of Ambedkar at Panjagutta. పంజాగుట్ట స‌ర్కిల్‌లో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని శుక్ర‌వారం బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్

By Medi Samrat  Published on  14 April 2023 10:03 AM GMT
పంజాగుట్ట కూడ‌లిలో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మంత్రి కేటీఆర్

పంజాగుట్ట స‌ర్కిల్‌లో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని శుక్ర‌వారం బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్, మ‌హ‌ముద్ అలీ, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు, నాయ‌కులు పాల్గొన్నారు.

అనంత‌రం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంద‌న్నారు. బీఆర్ అంబేద్క‌ర్ లేక‌పోతే తెలంగాణ లేద‌న్నారు. సెక్ర‌టేరియ‌ట్‌కు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డం కేసీఆర్‌కే సాధ్య‌మైంద‌న్నారు. కొత్త పార్ల‌మెంట్‌కు కూడా అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. పంజాగుట్ట కూడ‌లికి అంబేద్క‌ర్ పేరు పెడుతామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అమ‌లు చేస్తున్న ద‌ళిత‌బంధు.. సాహ‌సోపేత‌మైన ప‌థ‌కం అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ద‌మ్మున్న నేత అని కొనియాడారు.


Next Story