డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన‌ సీఎస్

Minister Ktr Started New Electric Double Decker Buses In Hyderabad. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి.

By Medi Samrat  Published on  7 Feb 2023 1:58 PM GMT
డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన‌ సీఎస్

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి. మంగ‌ళ‌వారం డబుల్ డెక్కర్ బస్సులను సీఎస్ శాంతి కుమారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేర‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను సీఎస్ ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇదిలావుంటే.. గతంలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ మేర‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.






Next Story