తెల్లాపూర్ చెరువులో భారీగా చేపల మృత్యువాత

హైదరాబాద్ శివార్లలోని తెల్లాపూర్ సమీపంలో ఉన్న ఉస్మాన్ నగర్‌లోని చెలికుంట చెరువులో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయి కనిపించాయి.

By -  Medi Samrat
Published on : 3 April 2026 6:00 PM IST

తెల్లాపూర్ చెరువులో భారీగా చేపల మృత్యువాత

హైదరాబాద్ శివార్లలోని తెల్లాపూర్ సమీపంలో ఉన్న ఉస్మాన్ నగర్‌లోని చెలికుంట చెరువులో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయి కనిపించాయి. మురుగునీరు చెరువులోకి వదలడమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటిపైన, ఒడ్డున చేపలు తేలుతూ కనిపించాయి. నీరు కలుషితమై దుర్వాసన వెదజల్లుతోంది.

సమీపంలోని లేబర్ క్యాంపులు, నిర్మాణ సంస్థల నుండి మురుగునీరు నేరుగా సరస్సులోకి వదులుతున్నారని 'తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్' తెలిపింది. ఇలాగే మురుగునీరు వదిలితే ప్రజారోగ్యం దెబ్బతినడమే కాకుండా, భూగర్భ జలాలు కూడా కలుషితమవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని, మురుగునీటిని వదులుతున్న మార్గాలను గుర్తించి వాటిని మూసివేయాలని కోరుతున్నారు.

Next Story