హైదరాబాద్ అభివృద్ధికి 'ఆర్‌ఆర్‌ఆర్' గేమ్ ఛేంజర్ : కిషన్ రెడ్డి

Land acquisition for Phase-I of Regional Ring Road from Sangareddy-Choutuppal soon. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) మొదటి దశ సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవపూర్-భువ‌న‌గిరి

By Medi Samrat  Published on  19 Feb 2022 1:26 PM GMT
హైదరాబాద్ అభివృద్ధికి ఆర్‌ఆర్‌ఆర్ గేమ్ ఛేంజర్ : కిషన్ రెడ్డి

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) మొదటి దశ సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవపూర్-భువ‌న‌గిరి, చౌటుప్పల్ మీదుగా వెళుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేజ్‌-1 నిర్మాణం కోసం సంగారెడ్డిలో 18 గ్రామాలు, మెదక్‌లో 22 గ్రామాలు, సిద్దిపేటలో 17, యాదాద్రి-భోంగిర్‌ జిల్లాలో 23 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) గేమ్ ఛేంజర్ అని ఆయన అన్నారు.

రెండు దశల్లో నిర్మించనున్న 347 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి.. ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా అనేక మందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. గజ్వేల్, కామారెడ్డి జిల్లాల్లో ప్రాజెక్టుల అమలు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కేంద్రం అనుమతులు మంజూరు చేసి అలైన్‌మెంట్‌లు పూర్తి చేశామని, మూడు ప్రత్యేక భూసేకరణ యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరిందని ఆయన తెలిపారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ రెండు దశల భూసేకరణ వ్యయం దాదాపు రూ. 4,000 కోట్లు అవుతుందని.. దానిని కేంద్రం, రాష్ట్రం సమానంగా భరిస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు. అయితే నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుందని తెలిపారు. రెండవ దశ ప్రాజెక్టు చౌటుప్పల్-షాద్‌నగర్-సంగారెడ్డిని కలుపుతుందని కిష‌న్ రెడ్డి తెలుపుతారు. దీని కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు ఇప్పటికే సిద్ధం చేయబడ్డాయని కిష‌న్ రెడ్డి అన్నారు.


Next Story