కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
నగరంలోని కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని మంగళవారం హైడ్రా కాపాడింది
By - Knakam Karthik |
కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ నగరంలోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. నగరంలోని కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని మంగళవారం హైడ్రా కాపాడింది. కొండాపూర్లోని శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం – మదీనగూడ మార్గంలో జంగమోని కుంట ఉంది. ఈ కుంటను కొందరు కబ్జా చేశారు. మట్టి పోసి 4 ఎకరాలను ప్లాట్లుగా మార్చారు. వాటిని విక్రయించేందుకు యత్నించారు.
అయితే జంగమోని కుంట ఆక్రమణలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో హైడ్రా సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఆక్రమణలు నిజమేనని తేలడంతో మంగళవారం ఉదయం వాటిని తొలగించారు. అనంతరం కుంట చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-కొండాపూర్లో రూ. 700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. ✅ కొండాపూర్ లోని జంగమోని కుంట ఆక్రమణలు పై హైడ్రా సీరియస్. ✅ శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం - మదీనగూడ మార్గంలో హైడ్రా ఆపరేషన్. ✅ 4 ఎకరాల జంగమోని కుంట ను మాయం చేసిన కబ్జాదారులు. ✅ మట్టి పోసి చదును చేసిన… pic.twitter.com/Z8wbR6Hb1E
— HYDRAA (@Comm_HYDRAA) February 10, 2026