Hyderabad: ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ వెంకటేశనగర్‌లోని సోఫా తయారీ గోదాములోని మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు గాయపడ్డారు.

By అంజి  Published on  24 July 2024 3:48 AM GMT
Hyderabad,  fire, furniture manufacturing warehouse, Jiyaguda

Hyderabad: ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

హైదరాబాద్: కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ వెంకటేశనగర్‌లోని సోఫా తయారీ గోదాములోని మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు గాయపడగా, 25 మంది సురక్షితంగా బయటపడ్డారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న సోఫా తయారీ గోదాం నుంచి మంటలు చెలరేగి మొదటి అంతస్తుకు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

భవనం లోపల సుమారు 25 మంది చిక్కుకున్నారు. అయితే వారిని అగ్నిమాపక సిబ్బంది,పోలీసులు విజయవంతంగా రక్షించబడ్డారు. మొదటి అంతస్తులో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో శివ ప్రియ అనే 10 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉంది. షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది.

అయితే అనధికార భవనంలో అక్రమంగా సోఫా గోదాం నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మంటల వల్ల మొత్తం నిర్మాణం దగ్ధమైంది, ఫలితంగా గణనీయమైన ఆస్తి నష్టం జరిగింది. అయితే అదృష్టవశాత్తూ, ప్రాణ నష్టం లేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story