ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తం

హైదరాబాద్‌లో ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి రెండు ప్రతిష్టాత్మక పండుగలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

By అంజి  Published on  6 Sep 2023 6:08 AM GMT
Ganesh immersion, Milad-un-Nabi, festivals, Hyderabad, Hyderabad police

ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తం

హైదరాబాద్‌లో ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి రెండు ప్రతిష్టాత్మక పండుగలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు మతాల పెద్దలతో 300 మంది సభ్యులతో పీస్ కమిటీ ఏర్పాటు చేశారు. మిలాద్ ఉన్ నబి వాయిదాకు పీస్ కమిటీ సభ్యులు ఒప్పుకున్నారు. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్‌ నబి నేపథ్యంలో సెంట్రల్ జోన్ డిసిపి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో 300 మంది పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 28 వ తేదీన గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి పండుగలు జరగనున్నాయి. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో పీస్ కమిటీ కి మిలాద్ ఉన్నబి వాయిదా వేసేందుకు ఒప్పుకున్నారు.

అలాగే భక్తులు 3, 6, 9 రోజుల్లో ఎప్పుడైనా గణేష్ విగ్రహ నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో పోలీసు బందోబస్తు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్ రావు వెల్లడించారు. రెండు పండుగలు ఒకేరోజు రావటంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రజలు శాంతిభద్రతలను కాపాడుకోవాలని సూచించారు. రెండు పండుగలు ఒకేరోజు రావటంతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చూస్తున్నారని.. అలాంటి వారికి మనం అవకాశం ఇవ్వొద్దని చెప్పారు. హైదరాబాద్ లా అండ్ అర్డర్‌‌ను దృష్టిలో ఉంచుకొని మిలాద్-ఉన్-నబీ ర్యాలీని రద్దు చేస్తూ.. ఎస్‌యూఎఫ్‌ఐ నిర్ణయం తీసుకున్నట్లు అసద్ వెల్లడించారు.

Next Story