హైడ్రా సైలెంట్‌ కాలేదు.. ఇకపై పక్కా ప్లాన్‌: ఏవీ రంగనాథ్‌

ఇకపై పక్కా ప్లాన్‌, ఆధారాలతో ముందడుగు వేస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. త్వరలోనే చెరువు అన్నింటికీ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లు ఫిక్స్‌ చేస్తామని చెప్పారు.

By అంజి  Published on  27 Oct 2024 2:15 AM GMT
Commissioner AV Ranganath, Hydraa, Hyderabad, GHMC

హైడ్రా సైలెంట్‌ కాలేదు.. ఇకపై పక్కా ప్లాన్‌: ఏవీ రంగనాథ్‌

హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణదారులకు గట్టి వార్నింగ్‌ ఇస్తూ హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌, అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తే శిథిలాల తొలగింపు బాధ్యత బిల్డర్లదేనని స్పష్టం చేశారు. శిథిలాలను క్లియర్ చేయడానికి అన్ని ఖర్చులను వారు భరించవలసి ఉంటుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ శనివారం బిల్డర్లకు హైడ్రా ద్వారా బిల్డర్లకు నోటీసులు జారీ చేసింది.

అక్టోబర్ 26, శనివారంతో తన ఏజెన్సీ ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రంగనాథ్ మీడియాకు ఒక ప్రకటనలో, శిథిలాల తొలగింపుకు టెండర్లు ప్రక్రియ ప్రకారమే జరిగాయని స్పష్టం చేశారు. అక్రమంగా శిథిలాల నుంచి ఇనుము రవాణా చేస్తున్నారనే ఆరోపణలను రంగనాథ్‌ ఖండించారు.

ఇకపై పక్కా ప్లాన్‌, ఆధారాలతో ముందడుగు వేస్తామని తెలిపారు. త్వరలోనే చెరువు అన్నింటికీ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లు ఫిక్స్‌ చేస్తామని చెప్పారు. గడిచిన వంద రోజుల్లో ఆక్రమణదారులకు హైడ్రా సింహస్వప్నంలా మారిందని రంగనాథ్‌ వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా అన్నీ చెక్‌ చేసుకున్నాకే స్థలాలు కొంటున్నారని తెలిపారు.

నివేదికల ప్రకారం.. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్న 100 సరస్సులను పునరుద్ధరించి సుందరీకరించాలని హైడ్రా నిర్ణయించింది. ఆ సరస్సుల సుందరీకరణలో భాగంగా ఆక్రమణలను తొలగించి వాటి పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందిస్తామని రంగనాథ్ వెల్లడించారు.

Next Story