ఎప్పుడు ఇక్క‌డికి వచ్చినా గుండె వేగం పెరుగుతుంది : సీఎం రేవంత్ రెడ్డి

ఎప్పుడు ఎల్బీ నగర్ కు వచ్చినా గుండె వేగం పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బైరామల్​ గూడ ఫ్లై ఓవ‌ర్‌ ప్రారంభోత్సవం లో ఆయన మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  9 March 2024 1:23 PM GMT
ఎప్పుడు ఇక్క‌డికి వచ్చినా గుండె వేగం పెరుగుతుంది : సీఎం రేవంత్ రెడ్డి

ఎప్పుడు ఎల్బీ నగర్ కు వచ్చినా గుండె వేగం పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బైరామల్​ గూడ ఫ్లై ఓవ‌ర్‌ ప్రారంభోత్సవం లో ఆయన మాట్లాడుతూ.. నాకు అండగా ఉండే వారంతా ఈ ప్రాంతంలో ఉన్నారన్నారు. మీ అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి మీదుగా మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. మురికి కూపంగా మారిన మూసీ పరివాహక ప్రాంతాన్ని రూ.40 నుంచి 50 వేల కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామ‌ని తెలిపారు.

లండన్ థెమ్స్ నదీపరివాహక ప్రాంతంలా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామ‌న్నారు. వైబ్రాంట్ తెలంగాణ 2050లో భాగంగా త్వరలోనే 55 కి.మీ మేర మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామ‌న్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. 354 కి.మీ ల రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల సబర్బన్ హైదరాబాద్ కింద రేడియల్ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామ‌ని పేర్కొన్నారు. అందరి సలహాలు, సూచనలతో వైబ్రాంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నామ‌ని వెల్ల‌డించారు. హైదరాబాద్ లో మెట్రో విస్తరణ అడ్డుకోవాలని చూసేవారిని ఈ వేదికగా హెచ్చరిస్తున్నా.. హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డు పడొద్దు.. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారికి నగర బహిష్కరణ శిక్ష విధించాలన్నారు.

Next Story