జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్..దున్నపోతుకు బీజేపీ కార్పొరేటర్ల వినతిపత్రం

జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ చివరి సమావేశానికి దున్నపోతును తీసుకువెళ్తూ బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలియజేశారు.

By -  Knakam Karthik
Published on : 25 Nov 2025 11:54 AM IST

Hyderabad, GHMC council meeting, BJP corporators, Congress Government

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్..దున్నపోతుకు బీజేపీ కార్పొరేటర్ల వినతిపత్రం

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ చివరి సమావేశానికి దున్నపోతును తీసుకువెళ్తూ బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలియజేశారు. "ముఖ్యమంత్రి, మేయర్ లేదా GHMC అధికారులకు విజ్ఞప్తి చేయడంలో అర్థం లేదు" అని కార్పొరేటర్లు తమ అసమ్మతిని నమోదు చేయడానికి దున్నపోతుతో వీధుల్లోకి వచ్చారు . జీహెచ్‌ఎంసీలో సమస్యలపై ప్రభుత్వానికి కంటే దున్నపోతుకు వినతిపత్రం అందజేయడం మంచిది" అని కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా ఎన్నోసార్లు మేయర్, కమిషనర్‌కు సమస్యలపై వినతిపత్రం ఇచ్చాం. అయినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్లు ఎక్కడా కూడా సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఇప్పటికైనా మేయర్, కమిషనర్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

Next Story