Secunderabad: ముత్యాలమ్మ ఆలయంపై దాడి.. కేసు నమోదు, ఒకరు అరెస్ట్‌

సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో దేవతలను ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  15 Oct 2024 2:32 AM GMT
Attack, Goddess, Mutyalamma temple, arrest

Secunderabad: ముత్యాలమ్మ ఆలయంపై దాడి.. కేసు నమోదు, ఒకరు అరెస్ట్‌

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో దేవతలను ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి దేవతను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. అక్టోబరు 14న జరిగిన ఘటనతో ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. విధ్వంసం గురించి తెలుసుకున్న స్థానికులు.. ఆ వ్యక్తిని పట్టుకుని ఆవరణలో దేహశుద్ధి చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆలయాన్ని సందర్శించి ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కోరారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమైన మాధవి లత సహా పలువురు బీజేపీ నేతలు ఆలయ ప్రాంగణంలో నిరసనకు దిగారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఆలయాన్ని సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దేవాలయాల భద్రతపై పలువురు హైదరాబాద్ పోలీసులను ప్రశ్నించారు.

పోలీసు వెర్షన్:

అక్టోబర్ 14న మహంకాళి పోలీస్ స్టేషన్‌కు సి.సాయి ప్రకాష్ నుండి ఫోన్ వచ్చింది. కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోని దుర్గామాత విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారన్నారు. గుర్తు తెలియని వ్యక్తిని ప్రజలు పట్టుకున్నారని ఫిర్యాదుదారు తెలిపారు. ఆలయం వెలుపల దుర్గామాత విగ్రహం పడి ఉంది. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు సెక్షన్ 333,331(4), 196,298,299 BNS కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం దర్యాప్తు చేపట్టారు.

Next Story