లో దుస్తుల్లో బంగారాన్ని దాచినా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప‌ట్టుకున్నారు

దుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి నుంచి అధికారులు 823 గ్రామ‌లు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2023 6:38 AM GMT
లో దుస్తుల్లో బంగారాన్ని దాచినా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప‌ట్టుకున్నారు

విమానాశ్ర‌యాలు బంగారం అక్ర‌మ ర‌వాణాకు అడ్డాగా మారుతున్నాయి. అధికారులు ఎన్ని క‌ట్టుదిట్టమైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ బంగారం అక్ర‌మ ర‌వాణా కొన‌సాగుతూనే ఉంది. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న బంగారాన్ని అధికారులు చేసుకున్నారు.

దుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి నుంచి అధికారులు 823 గ్రామ‌లు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు త‌నిఖీ చేస్తున్న స‌మ‌యంలో బంగారాన్ని లో దుస్తుల్లో దాచిన‌ట్లు గుర్తించారు. వెంట‌నే ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.47ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు చెప్పారు.

దుబాయ్ నుంచి వ‌చ్చిన ఇత‌డిని హైద‌రాబాద్ పాత‌బ‌స్తీకి చెందిన వ్య‌క్తిగా క‌స్ట‌మ్స్ అధికారులు గుర్తించారు. అత‌డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story