నిఖిల్‌ పెళ్లి వాయిదా.. ఎందుకంటే..?

By అంజి  Published on  2 April 2020 1:39 PM GMT
నిఖిల్‌ పెళ్లి వాయిదా.. ఎందుకంటే..?

‘క‌ళ్యాణం వ‌చ్చినా క‌క్కు వ‌చ్చినా ఆగ‌దు’ అనే సామెత అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ రావడంతో ఎక్కడి పెళ్లిలు అక్కడే ఆగిపోయాయి. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ముప్పై దాటి ఇంకా పెళ్లి చేసుకొని హీరోల లిస్ట్ పెద్దదే ఉంది. అయితే ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కుదామనుకున్న హీరోలు.. తమ పెళ్లిలను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే హీరో నితిన్‌ పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు హీరో నిఖిల్‌ కూడా ఇదే చేశాడు. ఏ కరోనా నా పెళ్లి ఆపలేదని, మా జంట పెళ్లిని ఏ శక్తీ ఆపలేదు, అవసరమైతే ఏదో ఒక గుడిలో ఇద్దరమూ పెళ్లి చేసేసుకుంటాం అని చెప్పిన నిఖిల్‌.. ఇప్పుడు తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. నిఖిల్ డాక్ట‌ర్ ప‌ల్ల‌వితో నిశ్చితార్ధం జరుపుకున్నాడు. ఏప్రిల్ 16న వాళ్ల పెళ్లి ముహూర్తంగా నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం కరోనా వైరస్ ముప్పుని తీవ్రంగా ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. రోజు రోజుకు కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.

Also Read: పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడి ఆత్మహత్య

ఇటీవలే ‘అర్జున్ సురవరం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న హీరో నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. భీమవరం అమ్మాయిని గోవాలో ప్రపొజ్ చేసి ఆమెను మెప్పించి వారి పెద్దల్ని కూడా ఒప్పించి మరి పెళ్లి ఖాయం చేసుకున్నాడు. పైగా ఎక్కడైతే ప్రపొజ్ చేసాడో అదే గోవాలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. డాక్టర్ పల్లవి వర్మని మొదటిసారి చూసినప్పుడే నిఖిల్ ప్రేమించాడట. మొత్తానికి ప్రేమించిన అమ్మాయినే అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గోవాలో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు.

Also Read: మూడు రోజుల శిశువుకు కరోనా పాజిటివ్

Next Story