లాక్‌డౌన్‌: భారీగా అక్రమ గుట్కా పట్టివేత.!

By అంజి  Published on  3 April 2020 3:42 AM GMT
లాక్‌డౌన్‌: భారీగా అక్రమ గుట్కా పట్టివేత.!

విజయవాడ: అక్రమ గుట్కాను తరలించేందుకు కొంతమంది కేటుగాళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికి పోలీసులు కన్నగుప్పి అక్రమ గుట్కాను కూరగాయల వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో పోలీసులు భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. కూరగాయలు తరలించే వాహనంలో గుట్కాను తరలిస్తుండగా.. పోలీసులు అడ్డుకొని వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో కూరగాయలతో పాటు భారీగా గుట్కాను పట్టుకున్నారు. గుట్కా విలువ సుమారు రూ.3 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గుట్కాను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బయట తిరగొద్దని పోలీసులు ఎంత చెప్తున్నా కొంత మంది మాత్రం అస్సలు వినడం లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/WhatsApp-Video-2020-04-03-at-8.20.15-AM.mp4

https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/WhatsApp-Video-2020-04-03-at-8.20.28-AM.mp4

Next Story