కీర్తికి అబార్షన్ చేసిన హాస్పిటల్ సీజ్
By Medi Samrat Published on 1 Nov 2019 4:52 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హయత్ నగర్ మర్డర్ కేస్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సొంత తల్లినే కడతేర్చిన కూతురు కీర్తి వ్యవహారం ముందు నుండి అనుమానస్పదమే అని పోలీసుల విచారణలో తేటతెల్లమవుతుంది. అయితే.. కీర్తి మైనర్ గా ఉన్నప్పుడు ఆమెకు మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ లోని పద్మ నర్సింగ్ హోమ్ లో శశి, బాల్ రెడ్డి లు అబార్షన్ చేయించిన సంగతి తెలిసిందే. హత్య కేసులో ఈ విషయం వెలుగులోకి రావడంతో కీర్తి రెడ్డికి అబార్షన్ చేసిన హాస్పిటల్ పై రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నేడు దాడులు చేశారు. మైనర్ బాలికకు అబార్షన్ ఎలా చేస్తారంటూ హాస్పిటల్ ను సీజ్ చేశారు.
Next Story