బ్రేకింగ్ న్యూస్: నగర పాలక సంస్థ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం
By సుభాష్ Published on : 27 April 2020 7:39 PM IST

చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదం.. రికార్డులు భద్రపరిచే గదిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో రికార్డులన్నీ పూర్తిగా దగ్ధం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. అగ్నిప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story