భారత్లో ఐదో కరోనా మరణం

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. భారత్లో కరోనా మరణాల సంఖ్య 5కు చేరుకుంది. తాజాగా జైపూర్లోని ఇటలీ టురిస్ట్ ఒకరు మృతి చెందారు. మృతి చెందిన ఇటలీ టూరిస్ట్ భార్య మాత్రమే కరోనా నుంచి కోలుకున్నారు.
కాగా, భారత్లో ఇప్పటి వరకు 190 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటికే కరోనాపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ ఇప్పటి వరకు 200 దేశాల వరకు విస్తరించింది. ఇప్పటి వరకు 10వేల వరకు మృతి చెందగా, 2 లక్షలకు పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కేసులు నమోదు కాకుండా ఇప్పటికే భారత్ విమాన సర్వీసులను సైతం రద్దు చేసింది. విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించింది.
.