Fact Check : ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయిందంటూ వీడియో వైరల్..?
Video of Tamilnadu Accident Passed off as Electric Scooter Exploding. రోడ్డుపై స్కూటర్ పేలి అక్కడికక్కడే ప్రయాణికులు మరణించారు అనే వీడియో వైరల్ అవుతోంది
By Medi Samrat Published on 14 Nov 2021 3:03 PM GMT
రోడ్డుపై స్కూటర్ పేలి అక్కడికక్కడే ప్రయాణికులు మరణించారు అనే వీడియో వైరల్ అవుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయిందనే వాదనతో పోస్టులు వైరల్ అవుతున్నాయి. బెంగళూరు రూరల్లోని భట్టారా గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి రైడర్ సజీవ దహనమైనట్లు ప్రచారం జరుగుతోంది.
సమాచారం :-
— #Bose DK WhoKilledBabai (@micky_4645) November 13, 2021
బెంగళూరు గ్రామీణ ప్రాంతం, భట్టారా గ్రామం క్రాస్, ఆర్. టి. ఓహ్ కార్యాలయం సమీపంలోని రోడ్డుపై ఎలక్ట్రిక్ బైక్ పగిలిపోయి రైడర్ సజీవదహనమయ్యాడు. pic.twitter.com/EqkrYbL8uq
"బెంగళూరు గ్రామీణ ప్రాంతం, భట్టారా గ్రామం క్రాస్, ఆర్. టి. ఓహ్. కార్యాలయం సమీపంలోని రోడ్డుపై ఎలక్ట్రిక్ బైక్ పగిలిపోయి రైడర్ సజీవదహనమయ్యాడు." అంటూ పోస్టులు పెడుతున్నారు. వాట్సప్ లో వీడియోలను వైరల్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిందన్న వాదన అవాస్తవం. బెంగుళూరు రూరల్లో ఈ సంఘటన జరిగిందన్న వాదన కూడా తప్పు అని తెలుస్తోంది.
NewsMeter వీడియో నుండి కీఫ్రేమ్లను తీసుకుని Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. దీపావళికి వారం రోజుల ముందు తమిళనాడులో ఈ ఘటన జరిగినట్లు గుర్తించాం.
హిందూస్తాన్ టైమ్స్ ప్రకారం, పుదుచ్చేరి మరియు తమిళనాడులోని విల్లుపురం జిల్లాల మధ్య ఉన్న చిన్న కొత్తకుప్పం సమీపంలో స్కూటర్పై తీసుకెళ్తున్న టపాసుల బ్యాగ్ పేలడంతో నవంబర్ 6న ఒక వ్యక్తి మరియు అతని ఏడేళ్ల కుమారుడు మరణించారు.
పేలుడు నాటి సీసీటీవీ ఫుటేజీలో ద్విచక్ర వాహనం పోలీసు బారికేడ్ను దాటుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరు బాధితులు పేలుడు జరిగిన ప్రదేశం నుండి 10-15 మీటర్ల దూరంలో విసిరివేయబడ్డారు. పేలుడు ధాటికి ఇద్దరు బైకర్లు తమ వాహనాలపై నుంచి పడిపోవడం సిసిటివి ఫుటేజీలో కనిపించింది, అయితే వెనుక నుండి వస్తున్న వారు సమయానికి బ్రేకులు వేశారు. పేలుడు ధాటికి ఘటనాస్థలంలో భారీగా పొగ అలుముకోవడంతో ప్రజలు అక్కడి నుండి పరుగులు తీశారు. (మూలం: ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్)
పుదుచ్చేరిలోని అరియాంకుప్పంకు చెందిన వ్యక్తి కలైనేశన్గా గుర్తించినట్లు ఇండియా టైమ్స్ తెలిపింది. అతను మరియు అతని కుమారుడు ప్రదీష్ తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూనిమేడులో ఉన్న తన అత్తమామ ఇంటికి వెళుతున్నారు. బాణాసంచా పేలడానికి కారణమేమిటనేది నిర్ధారించలేనప్పటికీ, బ్యాగ్లలోని టపాసులు వేడెక్కడం వల్ల మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. శక్తివంతమైన పేలుడులో మరో ఇద్దరు బైకర్లకు కూడా గాయాలయ్యాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ పేలడం వలన చనిపోయారని చెబుతున్న వాదన తప్పు. ఈ వీడియో తమిళనాడులో ద్విచక్ర వాహనంపై బాణాసంచా పేలడంతో తండ్రీకొడుకులు మృతి చెందిన సంఘటనకు సంబంధించినది. కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.