నిజమెంత: ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో కలిసి ఉన్నది జ్యోతి మల్హోత్రా అంటూ ప్రచారం.
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. అయితే ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వంటి రాజకీయ నాయకులతో కలిసి ఉన్న అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు
నిజమెంత: ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో కలిసి ఉన్నది జ్యోతి మల్హోత్రా అంటూ ప్రచారం
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. అయితే ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వంటి రాజకీయ నాయకులతో కలిసి ఉన్న అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వీటిని వివిధ కార్యక్రమాల్లో మల్హోత్రా తీసుకున్నారని నెటిజన్లు ఆరోపించారు.
ప్రధాని మోదీ
ఒక గ్రూప్ ఫోటోలో ఉన్న అమ్మాయి జ్యోతి మల్హోత్రా అంటూ ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆమెను ప్రత్యేకంగా ఎరుపు రంగు సర్కిల్ తో మార్క్ చేశారు. గ్రూప్ ఫోటోలో ఉన్న మహిళ జ్యోతి మల్హోత్రా అని పేర్కొంటూ ప్రచారం చేస్తున్నారు. (ఆర్కైవ్)
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్మీటర్ కనుగొంది. ఎందుకంటే చిత్రంలో ఉన్నది గేమర్ పాయల్ ధార్. ప్రధాని మోదీ, ఇతర గేమర్లతో కలిసి ఉన్నారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 2024 ఏప్రిల్ 15న ప్రచురించిన ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదికలో ‘గేమింగ్ పరిశ్రమపై నియంత్రణ అవసరం లేదు, అగ్రశ్రేణి గేమర్లతో సంభాషణలో ప్రధాని మోదీ చెప్పారు’ అనే శీర్షికతో ఉన్న అదే చిత్రం మాకు కనిపించింది.
చిత్రం వివరణ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీతో గేమర్స్ అనిమేష్ అగర్వాల్, మిథిలేష్ పాటంకర్, నమన్ మాథుర్, అన్షు బిష్త్, పాయల్ ధరేలను కలిగి ఉంది.
పాయల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను చూడగా, ఏప్రిల్ 13, 2024 నాటి ఒక పోస్ట్ మాకు కనిపించింది. అందులో ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఉన్న చిత్రం ఉంది. ఆ క్యాప్షన్లో ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో గేమింగ్ భవిష్యత్తు గురించి చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ ఇద్దరు మహిళలతో ఉన్న రెండు చిత్రాల కోల్లెజ్ ఆన్లైన్లో వైరల్ అవుతూ ఉంది. రెండు చిత్రాలలో జ్యోతి మల్హోత్రా ఉందని చెబుతున్నారు.
ఒక X యూజర్ కోల్లెజ్ను షేర్ చేసి, “పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా రాహుల్ గాంధీకి ఎంత దగ్గరగా ఉన్నారు. ప్రతి దేశద్రోహి అతనితో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది? రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేయాలి…” అంటూ పోస్టుల్లో తెలిపారు. (ఆర్కైవ్)
నిజ నిర్ధారణ:
న్యూస్మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది, ఎందుకంటే మొదటి చిత్రం బీజేపీ నాయకురాలు అదితి సింగ్ ముఖాన్ని జ్యోతి మల్హోత్రాతో మార్ఫింగ్ చేశారు.
చిత్రం 1: రివర్స్ ఇమేజ్ సెర్చ్ 2018లో ఇండియా టుడే, ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన నివేదికలకు దారితీసింది. ఈ నివేదికల ప్రకారం, ఆ చిత్రం అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న అదితి సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఉన్నట్లు చూపిస్తుంది.
ఆ తర్వాత అదితి సింగ్ 2021లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
చిత్రం 2: రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా రెండవ చిత్రం మాకు కనిపించింది, దీనిని సెప్టెంబర్ 18, 2022న కాంగ్రెస్ పార్టీ అధికారిక X హ్యాండిల్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్లో ఆ చిత్రం భారత్ జోడో యాత్ర నుండి వచ్చిందని పేర్కొంది. కానీ ఆ మహిళ పేరును ప్రస్తావించలేదు. అయితే, ఆమె ముఖం జ్యోతి మల్హోత్రా ముఖంలా లేదు.
ఈ చిత్రం కేరళలోని అలప్పుజలో తీశారు.
ये जो मोहब्बत और मुस्कान है,इसी से मजबूत हमारा हिंदुस्तान है।कदम, कंधे और हाथ मिलाकर चलते हुए, इस #BharatJodoYatra को तय करना बड़ा आसान है।। pic.twitter.com/99bXjohJ9h
— Congress (@INCIndia) September 18, 2022
అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ మ్యానిఫెస్టోను చూపిస్తూ, అఖిలేష్ యాదవ్ పక్కన ఒక మహిళ, ఒక పురుషుడు నిలబడి ఉన్న చిత్రం కూడా ఆన్లైన్లో వైరల్ అవుతూ ఉంది. ఆ మహిళ జ్యోతి మల్హోత్రా అని చెబుతున్నారు.
ఒక X యూజర్ ఈ చిత్రానికి క్యాప్షన్ “మిత్రులారా, ఈ దేశద్రోహి జ్యోతి జాసూస్ సమాజ్వాదీ పార్టీ అధినేతతో ఏం చేస్తోంది?” అంటూ పోస్టులు పెట్టారు. (ఆర్కైవ్)
నిజ నిర్ధారణ:
న్యూస్మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని ధృవీకరించింది. ఎందుకంటే ఈ చిత్రాన్ని డింపుల్ యాదవ్ ముఖం స్థానంలో జ్యోతి మల్హోత్రాతో మార్ఫింగ్ చేశారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించినప్పుడు, 2017లో ప్రచురించిన NDTV, బిజినెస్ స్టాండర్డ్ నివేదికలలో అదే చిత్రం కనిపించింది. అసలు చిత్రంలో 2017లో పార్టీ మ్యానిఫెస్టో ఆవిష్కరణ సమయంలో అఖిలేష్ యాదవ్ తన భార్య డింపుల్ యాదవ్ పక్కన ఉన్నట్లు చూపిస్తుంది.
కాబట్టి, ఈ చిత్రాలలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉన్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.