విశాఖ సింహాద్రి అప్పన్న ఉద్యోగులు చేతివాటానికి పాల్పడ్డారు. హుండీ లెక్కింపులో ఇద్దరు ఉద్యోగులు డబ్బులు కొట్టేశారు. ఒకరు పర్మినెంట్ ఉద్యోగి రమణ కాగా మరొకరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్గా గుర్తించారు. ఉద్యోగులిద్దరూ హుండీలో రూ.50 వేలు దొంగిలించారు. ఈ మేరకు ఆలయ పరిపాలన విభాగ AEO రమణమూర్తి గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్మినెంట్ ఉద్యోగిని ఈవో త్రినాథరావు సస్పెండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించే దిశగా చర్యలు చేపట్టారు.