సూర్య 'ఈటీ' సినిమా తెలుగు హక్కులు.. ఎవరు సొంతం చేసుకున్నారంటే.!

Suriya’s ET Telugu movie Rights Sold. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో విమర్శకుల ప్రశంసలు పొందిన 'ఆకాశం నీ హద్దురా', 'జై భీం' సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల

By అంజి  Published on  13 Feb 2022 5:41 AM GMT
సూర్య ఈటీ సినిమా తెలుగు హక్కులు.. ఎవరు సొంతం చేసుకున్నారంటే.!

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో విమర్శకుల ప్రశంసలు పొందిన 'ఆకాశం నీ హద్దురా', 'జై భీం' సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందిన బహుముఖ నటుడు సూర్య, పాండిరాజ్ దర్శకత్వంలో కళానిధి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈటీ (ఎతర్క్కుం తునిందావన్)తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో మారన్ తెరకెక్కించారు. కాగా టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకుంది.

సూర్యకు ఉన్న భారీ మార్కెట్ విలువను దృష్టిలో ఉంచుకుని, తెలుగులో ఈటీ పేరుతో ఈ సినిమా హక్కులు ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10, 2022న ఒకేసారి విడుదల కానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్య తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడు. డబ్బింగ్ స్టూడియోలో అతని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్, డి ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ సూర్యకు జోడిగా నటించింది. ఈ చిత్రంలో వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్‌కిరణ్, శరణ్య పొన్వన్నన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈటీ సినిమా తెలుగులో గ్రాండ్ రిలీజ్ అవనుంది. ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ ఇక్కడ రిలీజ్ చేస్తుంది.

Next Story