పాడుతా తీయగా.. తెలుగు వాళ్లకు ఈ షో మీద ఎంతో ప్రేమ ఉంది. కానీ ఇటీవలి కాలంలో ఈ కార్యక్రమం వివాదాస్పదమవుతోంది. టాలెంట్ ను తొక్కేస్తున్నారంటూ గాయని ప్రవస్తి పలు ఆరోపణలు చేశారు. తాజాగా ఎలిమినేషన్ ఎపిసోడ్ చూశాక స్పందించాల్సి వస్తోందని, రియాలిటీ షో చరిత్రలోనే ఇంత అనైతికంగా ఎడిటింగ్లు చేసి ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారనుకోలేదని ప్రవస్తి తెలిపారు. ఇంత అన్ప్రొఫెషనల్గా ఎడిట్ చేస్తారని మాత్రం ఊహించలేదని వాపోయారు.
నా ఎలిమినేషన్ అప్పుడు సునీత మేడమ్ తప్ప మిగతా జడ్జిలు లేరని చెప్పాను. చంద్రబోస్ సర్ లేనే లేరు. కీరవాణి సార్.. నాకు సంబంధం లేదని లేచి వెళ్లిపోయారని, అది ఎడిటింగ్లో తీసేశారన్నారు ప్రవస్తి. కానీ ఆయన చప్పట్లు కొడుతున్న సీన్ పెట్టారు. అది ఎక్కడినుంచి తీసుకొచ్చి అతికించారో తనకు తెలీదన్నారు. ఎలిమినేషన్లో చప్పట్లు కొట్టే సీన్ ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియాలి. చివరి రౌండ్లో ఇద్దరం మిగిలాం. నన్ను ఎలిమినేట్ చేసినప్పుడు నాకెన్ని మార్కులు వచ్చాయి, ఎందుకు ఎలిమినేట్ చేశారనేది చూపించలేదని వివరించారు.