హైదరాబాద్‌లో సందడి చేసిన 'రక్షాబంధన్‌' చిత్ర బృందం

Rakshabandhan Movie Team Visits Hyderabad. బంధాలను మనోహరంగా చూపించిన ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ‘రక్షాబంధన్‌’ చిత్ర బృందం

By Medi Samrat  Published on  6 Aug 2022 11:51 AM GMT
హైదరాబాద్‌లో సందడి చేసిన రక్షాబంధన్‌ చిత్ర బృందం

బంధాలను మనోహరంగా చూపించిన ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ 'రక్షాబంధన్‌' చిత్ర బృందం, ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు నగరాలలో సందడి చేస్తున్నారు. రక్షాబంధన్‌ పండుగ సందర్భంగా విడుదల కాబోయే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఈ బృందం హైదరాబాద్‌ వచ్చింది. ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఈ చిత్ర బృందం దుబాయ్‌, పూనె, ఇండోర్‌లలో సందడి చేసింది. ఈ బృందంలో అక్షయ్‌కుమార్‌, నిర్మాత ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, చిత్ర తారాగణంలో సాడియా ఖతీబ్‌, స్మృతి శ్రీకాంత్‌, సహేజ్మీన్‌ కౌర్‌, దీపికా ఖన్నాలు హైదరాబాద్‌ విచ్చేశారు.

పీవీఆర్‌ లో మీడియా సమావేశంలో పాల్గొన్న వీరు అనంతరం చార్మినార్‌ వద్ద సందడి చేశారు. హైదరాబాద్‌కు తలమానికమైన చార్మినార్‌ వద్ద ఫోటోలనూ దిగారు. తమ అభిమాన సూపర్‌స్టార్‌ తో పాటుగా చిత్ర బృందాన్ని దగ్గరగా చూసేందుకు, వారితో ముచ్చటించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.

ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలను జీ స్టూడియోస్‌తో కలిసి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, హిమాంశు శర్మ, అల్కా హిరానందానీ, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ తీసుకున్నాయి. హిమాంశు శర్మ, కనికా ధిల్లాన్‌లు రచించ‌గా,, రక్షాబంధన్‌కు సంగీత దర్శకత్వం హిమేష్‌ రేష్మియా అందించారు. ఈ చిత్రంలోని పాటలకు సాహిత్యాన్ని ఇర్షాద్‌ కమిల్‌ అందించారు.

రక్షా బంధన్‌ చిత్రంలో భూమి పద్నేకర్‌, అక్షయ్‌కుమార్‌, నీరజ్‌ సూద్‌, సీమా పహ్వా, సాదియా ఖతీబ్‌, అభిలాష్‌ థపిల్యాల్‌, దీపికా ఖన్నా, స్మృతి శ్రీకాంత్‌, సహెజ్మీన్‌ కౌర్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 11, 2022 న విడుదల కానుంది.


Next Story