బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని, అందుకే జైలుకు వెళ్లాల్సి వచ్చిందని విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది.
కుటుంబంలో పెళ్లి ప్రాతిపదికన బెయిల్ కోరుతూ నటుడు రాజ్పాల్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మౌఖిక వ్యాఖ్య చేస్తూ.. మీ క్లయింట్ తన వాగ్దానాన్ని నెరవేర్చనందున జైలుకు వెళ్లాడని పేర్కొంది.
జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మతో కూడిన ధర్మాసనం కనీసం రెండు డజన్ల సందర్భాలలో రాజ్పాల్ యాదవ్ తన వాగ్దానాన్ని నెరవేరుస్తానని.. డబ్బును తిరిగి ఇస్తానని ప్రకటనలు ఇచ్చారని.. కానీ అలా చేయడంలో విఫలమయ్యారని అన్నారు.