సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నిర్మాత

ప్రముఖ సినీ నిర్మాత ఎస్కేఎన్ హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

By -  Medi Samrat
Published on : 24 Jan 2026 9:59 AM IST

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నిర్మాత

ప్రముఖ సినీ నిర్మాత ఎస్కేఎన్ హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి, సినిమాతో పాటు నటీనటులను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ తన పేరుతో, ఒక సినిమా గురించి, అందులోని నటీనటుల గురించి తప్పుదోవ పట్టించేలా, అవమానకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్కేఎన్ హెచ్చరించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నకిలీ ఖాతాలను నిర్వహిస్తున్న వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిసింది.

Next Story