ఢిల్లీ హైకోర్టుకు అక్కినేని నాగార్జున

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు.

By -  Medi Samrat
Published on : 25 Sept 2025 5:32 PM IST

ఢిల్లీ హైకోర్టుకు అక్కినేని నాగార్జున

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ దుర్వినియోగంపై న్యాయపోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా ఏఐ సాయంతో తన ఫొటోలు, వీడియోలను అక్రమంగా వాడుకుంటూ, వాటి ద్వారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్న ఈ చర్యలను వెంటనే అడ్డుకోవాలని ఆయన కోర్టును కోరారు. నాగార్జున తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తూ, కొన్ని వెబ్‌సైట్‌లు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆయన ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాయని తెలిపారు.

ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న సుమారు 14 వెబ్‌సైట్‌లను గుర్తించామని, వాటిని, వాటికి సంబంధించిన లింకులను తక్షణమే ఇంటర్నెట్ నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని నాగార్జున కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం, నాగార్జున లేవనెత్తిన అంశాలను తీవ్రంగా పరిగణించింది. ఆయన వ్యక్తిగత హక్కులను కాపాడతామని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Next Story