నాగబాబు మళ్లీ సీరియస్ అయ్యారు

By Medi Samrat  Published on  27 March 2023 10:31 AM GMT
నాగబాబు మళ్లీ సీరియస్ అయ్యారు

రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకల్లో మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడారు. అయితే కొందరు ఫ్యాన్స్ ‘పవర్ స్టార్ సీఎం.. పవర్ స్టార్ సీఎం’ అంటూ నినాదాలు చేశారు. ఆయన వేదికపై మాట్లాడుతుండగా ఆ వాయిస్ ఆయనకు వినిపించింది. దీంతో ‘‘మాట్లాడతాను.. కాస్త ఆగండి. కళ్యాణ్ బాబు గురించి కొద్దిసేపటి తర్వాత మాట్లాడదామని అనుకున్నా. ఇలా అల్లరి చేస్తే అసలు కంటెంట్ పోతుంది. కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి’’ అని కోరారు. కానీ పదేపదే ‘పవర్ స్టార్ సీఎం.. పవర్ స్టార్ సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాగబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. తనను తాను నియంత్రించుకుంటూ.. ‘‘మనం ఇవాళ వచ్చింది చరణ్ బర్త్ డే వేడుకలకు కాబట్టి.. మొదట గౌరవం చరణ్ కు ఇవ్వాలి. అది మన సంస్కారం. జనసేన సైనికులు ఆ సంస్కారాన్ని వదులుకోవద్దని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’’ అని చెప్పారు. కొద్దిసేపు నిశబ్దంగా ఉన్న నాగబాబు తర్వాత మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు కదా.. సీఎం సీఎం అని అరిస్తే కాదు ఓట్లు గుద్ది సీఎంను చేయాలి అని అన్నారు కదా. కాబట్టి సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. మీకు దమ్ముంటే ఎలక్షన్ లో పాల్గొని జనాల్ని మోటివేట్ చేయండి. అది పవన్ కళ్యాణ్ కు మనం ఇచ్చే గొప్ప బహుమతి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆరెంజ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న విషయాన్ని నాగబాబు ప్రస్తావించారు. ఆరెంజ్ చిత్రం వల్ల నేను కాస్త దెబ్బతిన్నాను. అప్పట్లో ఆ చిత్రం కేవలం యావరేజ్ గా మాత్రమే ఆడింది. కానీ ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఆ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇప్పటి జనరేషన్ కి ఆ మూవీ చాలా బాగా నచ్చేస్తోంది. ఆరెంజ్ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో ఇప్పుడు అర్థం అవుతోంది. ఒక జనరేషన్ ముందుగానే ఆ చిత్రాన్ని తీశాం అని నాగబాబు అన్నారు.


Next Story