హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ని కలిసి ఏపీలో హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్ పెంపు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇప్పించవలిసిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖను సంప్రదించనుంది.
థియేటర్స్ బంద్ వివాదం తర్వాత కొత్త సినిమాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించి వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్నిసంప్రదించాలని, టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఇప్పుడు అదే తరహాలో ఏఎం రత్నం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ని కలిశారు.