'గుంటూరు కారం' సెకండ్ సింగిల్‌.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్న చిత్రం 'గుంటూరు కారం'.

By Medi Samrat  Published on  9 Dec 2023 2:45 PM GMT
గుంటూరు కారం సెకండ్ సింగిల్‌.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని 'దమ్ మసాలా' సాంగ్ సూపర్ సక్సెస్ అయ్యింది. దమ్ మసాలా పాట విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పాటను సంజిత్ హెగ్డే, థమన్ పాడగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

ఇప్పుడు గుంటూరు కారం నుండి మరో పాట రాబోతోంది. ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదలకు రంగం సిద్ధమైందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 11న సాయంత్రం 4.05 గంటలకు 'ఓ మై బేబీ' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ కానుంది. పూర్తి పాటను డిసెంబరు 13న విడుదల చేయనున్నారు. 'గుంటూరు కారం' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ నటులు సునీల్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రఘుబాబు వంటి వారు ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

Next Story