పంత్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్న బాలీవుడ్ నటులు

Bollywood actors Anil Kapoor, Anupam Kher meet cricketer Rishabh Pant. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో

By Medi Samrat  Published on  31 Dec 2022 3:30 PM GMT
పంత్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్న బాలీవుడ్ నటులు

టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళుతుండగా, పంత్ ప్రయాణిస్తున్న బెంజ్ కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. పంత్ కు ప్రస్తుతం డెహ్రాడూన్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ కు వెళ్లి, పంత్ ను పరామర్శించారు. డాక్టర్లను అడిగి పంత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనిల్ కపూర్ మీడియాతో మాట్లాడుతూ, పంత్ బాగానే ఉన్నాడని, అభిమానుల్లా పంత్ ను కలిశామని తెలిపారు. పంత్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ అతడు క్రికెట్ మైదానంలో దిగాలని ప్రార్థిద్దామని అన్నారు. అనుపమ్ ఖేర్ స్పందిస్తూ మాట్లాడుతూ.. పంత్ తల్లి, ఇతర బంధువులతో మాట్లాడామని.. ఎవరూ ఎలాంటి ఆందోళన అవసరంలేదని అన్నారు. పంత్ ను తాము ఎంతగానో నవ్వించామని అనుపమ్ ఖేర్ తెలిపారు.


Next Story