ఈ సమయంలో అలాంటి ట్వీట్ వేసిన బండ్ల గణేష్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు.

By Medi Samrat
Published on : 26 May 2025 2:15 PM

ఈ సమయంలో అలాంటి ట్వీట్ వేసిన బండ్ల గణేష్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. ఎవరో ఎక్కడో చెబితే.. ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారని అది కాస్తా పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకున్నట్లుగా ప్రచారం జరిగిందని దిల్ రాజు చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. మే 18న జరిగిన ఛాంబర్ మీటింగ్‌లో ఏం జరిగిందో తెలియకుండానే మీడియా వార్తలను ప్రచురించిందన్నారు దిల్ రాజు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని వారించానని, ఛాంబర్‌కు వాళ్లు పర్సంటేజీ విషయంలో లేఖ రాశారని తెలిపారు. వాళ్లు అనుకున్నది జరగపోతే బంద్ చేస్తామనేది కేవలం ఆలోచన మాత్రమే అని, సినిమా థియేటర్లను మూసి వేయడం అనేది జరగదని అన్నారు. ఏప్రిల్‌లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మధ్య చర్చలు జరిగాయని, అందులో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

అదే సమయంలో మరో నిర్మాత బండ్ల గణేష్ కూడా స్పందించారు. ఎక్స్ లో ట్వీట్ వేశారు. "ఆస్కార్ నటులు, కమలహాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం" అంటూ బండ్ల గణేశ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతల మధ్య ఏ మాత్రం సఖ్యత లేదని స్పష్టంగా తెలిసిపోతోంది.

Next Story