వీళ్లు ఇప్పుడే ఇలా చేస్తే.. రేపు సినిమాలో ఎన్ని చేస్తారు: సరోజ్ కుమార్
బండి సరోజ్ కుమార్.. అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న ఆల్ రౌండర్. అతడి సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి.
By Medi Samrat
బండి సరోజ్ కుమార్.. అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న ఆల్ రౌండర్. అతడి సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి. ఆలోచింపజేసే ధోరణిలో ఉంటాయి. బండి సరోజ్ కు కల్ట్ అభిమానులు ఉన్నారు. బయట సినిమాలు అసలు చేయరు. ఇటీవల మోగ్లీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా టీజర్ లో అతడి విలనిజానికి మంచి పేరు వచ్చింది. అయితే సరోజ్ కుమార్ కు వచ్చిన పాజిటివ్ కామెంట్స్ విషయంలో ఏదో మాయ జరుగుతోందని సరోజ్ ఆరోపించారు.
యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న రెండో ప్రాజెక్ట్ ‘మోగ్లీ’. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తను చేసిన విలన్ క్యారెక్టర్పై వస్తున్న ప్రశంసలను మూవీ టీమ్ వాటిని డిలీట్ చేసి తనకు అన్యాయం చేస్తోందని సరోజ్ కుమార్ సంచలన ట్వీట్ పెట్టాడు. "కామెంట్స్ ఏ కదా.. లైట్ తీసుకోమని చెప్పేవాళ్ళకి. నేను ఇప్పటి వరకూ బయట సినిమాలు ఒప్పుకోలేదు. సందీప్ రాజ్ ఒత్తిడితో కథ విన్నాక, నా పాత్ర నచ్చి అందులో ఎటువంటి మార్పులు ఉండకూడదు అనే అగ్రిమెంట్ తో ఈ సినిమాలో పారితోషికం లేకుండా ప్రాణం పెట్టి నటించాను. 8 నెలలు నా సమయాన్ని ఇచ్చాను. నాకు వస్తున్న రిసెప్షన్ చూసి ముందు థంబ్ నెయిల్స్ మార్చారు. తర్వాత కామెంట్స్ ఆఫ్ చేశారు. నేను దర్శకుడితో మాట్లాడాక మళ్ళీ ఆన్ చేశారు. ఒక 3 కామెంట్లను బాట్ లికెస్ తో బూస్ట్ చేసి, నా రోల్ కి వస్తున్న ఆదరణను మ్యాచ్ చేయడానికి చూసారు. కుదరలేదు. ఇప్పుడు నా టాప్ కామెంట్లు డిలీట్ చేశారు. ఇంకా డిటైల్డ్ గా ప్రూఫ్స్ తో ముందుకు వస్తాను. ఇప్పటికీ అక్కడ ఉన్న 1600 కామెంట్లలో 99% నా పైన ప్రేక్షకుడు పలికించిన ప్రేమే ఉంది. నాకు పీఆర్ లు లేరు.. ప్రేక్షకుడి బలమే నా పీఆర్. ఆ సునామీని ఎవ్వడూ ఆపలేరు. కానీ వీళ్లు ఇప్పుడే ఇలా చేస్తే, రేపు సినిమాలో ఎన్ని చేస్తారు. ఎవరిని నమ్మాలి. నిర్మాత వరకూ వెళ్ళే అవకాశం నాకు లేదు. నేను ఇండస్ట్రీలో బ్రతికేయడానికి రాలేదు. గత 5 సంవత్సరాలుగా నా కళతో నేను ప్రేక్షకుల్ని సంపాదించుకున్నాను. ఇలాంటి ఇన్ సెక్యూర్ నెపోటిజం, పాలిటిక్స్ ని నేను అస్సలు బేర్ చెయ్యను. వాళ్లు చేసిన పనిని నేను బయటపెడతాను. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని నేను కోరుతున్నాను. ఇది ప్రమేయం లేకుండా జరుగుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను." అంటూ ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ తర్వాత సమస్యకు పరిష్కారం దొరికిందంటూ మరో పోస్టు పెట్టారు బండి సరోజ్.