ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. తన కుమారుడు అక్కినేని అఖిల్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు.
ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. అఖిల్ వివాహం ఈ నెల 6వ తేదీన జరగనున్న నేపథ్యంలో, నాగార్జున ప్రముఖులను స్వయంగా కలిసి వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు ఉండవల్లికి విచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇరువురు కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం.