'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. అప్పుడే విడుదల
‘Aadavaallu Meeku Johaarlu’ to release on March 4. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా దర్శకుడు తిరుమల కిషోర్ రూపొందించిన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
By అంజి Published on
20 Feb 2022 9:40 AM GMT

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా దర్శకుడు తిరుమల కిషోర్ రూపొందించిన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లీన్ 'యు' సర్టిఫికేట్తో ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ విడుదల చేయడానికి అనుమతినిచ్చింది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో శర్వానంద్కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సౌండ్ట్రాక్లను అందించారు. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు సెన్సేషనల్ హిట్గా నిలిచాయి. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ఖుష్బు, రాధిక శరత్కుమార్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏస్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందించిన ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ ఫోటోగ్రఫీ డైరెక్టర్గా పని చేశారు.
Next Story