ఏపీ EAPCET రిజల్ట్స్ వచ్చేశాయ్..ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఈఏపీసెట్-2025(AP EAPCET) రిజల్ట్స్ విడుదల అయ్యాయి

By Knakam Karthik
Published on : 8 Jun 2025 6:09 PM IST

Education News, Andrapradesh, AP EAPCET-2025 results, Minister Nara Lokesh

ఏపీ EAPCET రిజల్ట్స్ వచ్చేశాయ్..ఇలా చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2025(AP EAPCET) రిజల్ట్స్ విడుదల అయ్యాయి. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 19 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,429 మంది అప్లయ్ చేసుకున్నారు. వారిలో 2,64,840 మంది ఇంజినీరింగ్, 75,460 మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను రాశారు.

ఇక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఫలితాలు విడుదల అయ్యాయని ట్వీట్ చేశారు. ఇంజినీరింగ్‌లో 1.89 లక్షల మంది అర్హత సాధించారని, 71.65 శాతంతో పాసయ్యారు అని తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 67.7 వేల మంది క్వాలిఫై కాగా, 89.8 శాతం పాస్‌ అయ్యారని తెలిపారు. ఫలితాలకు సంబంధించిన ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు cets.apsche.ap.gov.in/EAPCETను సందర్శించాలని సూచించారు. కాగా ప్రవేశ పరీక్షల్లో పాసయిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.

Next Story