శ్రీరామనవమి 2023: భారత్‌లోని ప్రసిద్ధ రామాలయాలు ఇవే

శ్రీరామ నవమి సందర్భంగా.. మీరు జీవితంలో ఒక్కసారైనా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించవలసిన కొన్ని రాముడి

By అంజి  Published on  29 March 2023 4:55 AM GMT
Sri Ram Navami 2023, famous Ram Temples, India

శ్రీరామనవమి 2023: భారత్‌లోని ప్రసిద్ధ రామాలయాలు ఇవే

శ్రీరామ నవమి సందర్భంగా.. మీరు జీవితంలో ఒక్కసారైనా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించవలసిన కొన్ని రాముడి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.

1. శ్రీ సీతారాముల ఆలయం, భద్రాచలం

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖమైనది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.

2. కాలరామ్ ఆలయం, మహారాష్ట్ర

ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయానికి రాముని నల్లని విగ్రహం నుండి కాలరామ్‌ అనే పేరు వచ్చింది. రాముడు వనవాస సమయంలో నివసించిన ప్రదేశంలో ఈ ఆలయం ఉందని నమ్ముతారు. దీనిని 1782లో పాత చెక్క దేవాలయం ఉన్న స్థలంలో సర్దార్ రంగారావు ఒధేకర్ నిర్మించారు. ఇది పశ్చిమ భారతదేశంలోని శ్రీరాముడి అత్యుత్తమ ఆధునిక దేవాలయాలలో ఒకటి.

3. రఘునాథ్ ఆలయం, జమ్మూ అండ్‌ కాశ్మీర్

ఇది జమ్మూలో ఉన్న రామాలయం. ఏడు హిందూ పుణ్యక్షేత్రాల సముదాయాన్ని కలిగి ఉంది. ఈ రెగల్ టెంపుల్‌లో చాలా మంది దేవతలు ఉన్నారు. అయితే అధిష్టానం విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం అయిన రాముడు ఇక్కడ ఉన్నాడు. ఆలయం లోపలి గోడలు మూడు వైపులా బంగారు రేకులతో కప్పబడి ఉన్నాయి. ఆలయం లోపల, వివిధ లింగాలు లేదా ఫాలిక్ ఆకారంలో ఉన్న శివుని రూపాలను కలిగి ఉన్న ఒక గ్యాలరీ కూడా ఉంది. వాటి పైన సాలిగ్రామాలు ఉంచబడ్డాయి.

4. ఒంటిమిట్ట కోదండ రామాలయం, ఆంధ్రప్రదేశ్‌

ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంది. ఇది ప్రాచీన దేవాలయం. ఆలయంలో కోదండరాముడు సీతాదేవీ, లక్ష్మణుడితో కలిసి ఉంటాడు. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా శ్రీరామనవమి జరుపుతుంది. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది.

5. రాజా రామ్ ఆలయం, మధ్యప్రదేశ్

ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఉంది. రాముడు భక్తులచే రాజుగా పూజించబడే ఏకైక ఆలయం ఇది. రాముడు ఆలయం లోపల సీతా దేవితో పాటు సోదరుడు లక్ష్మణుడు, మహారాజ్ సుగ్రీవుడు, నర్సింహాస్వామి దేవుడితో కలిసి నిలబడి ఉన్నాడు.

6 . రామస్వామి ఆలయం, తమిళనాడు

కుంభకోణంలో ఉన్న ఇది భారతదేశంలోని రాముడి యొక్క మరొక ప్రముఖ దేవాలయం. దీనిని 15వ శతాబ్దంలో విజయనగర రాజు నిర్మించారు. ఆలయం యొక్క సాధారణ నిర్మాణం కేవలం గర్భగుడి, స్తంభాల హాలు, అర్ధ మండపం మాత్రమే కలిగి ఉంటుంది. రామస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అయోధ్యగా చెప్పబడుతుంది. భరత, శత్రుఘ్నులతో పాటు రాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలను మీరు చూడగలిగే ఏకైక ఆలయం ఇది.

Next Story