అమరావతి: దేవీపట్నం బోటు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు బాధ్యత వహిస్తూ ఏపీ ప్రభుత్వం నష్ట పరిహారం విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించింది ఏపీ ప్రభుత్వం. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నష్ట పరిహారం చెల్లించారు. సెప్టెంబర్ 25న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో బోటు మునిగి 30 మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే.