Bhadradri: వివాహిత కోసం గొడవ.. గడ్డపారతో కొట్టి యువకుడి హత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు.

By అంజి  Published on  23 Nov 2023 2:04 AM GMT
Bhadradri Kothagudem, Crime news, Telangana

Bhadradri: వివాహిత కోసం గొడవ.. గడ్డపారతో కొట్టి యువకుడి హత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. గ్రామంలో చికెన్ దుకాణం నడుపుతున్న నిందితుడు షేక్ అఫ్రిది, మిరియాల నవీన్ (21) అనే యువకుడిని గడ్డపారతో కొట్టి, ఆ పనిముట్టుతో తల పగులగొట్టడంతో మంగళవారం అర్థరాత్రి అక్కడికక్కడే మృతి చెందాడు. అంగన్‌వాడీ టీచర్‌తో వివాహేతర సంబంధంపై వారిద్దరూ ఒకరిపై ఒకరు పగ పెంచుకున్నట్లు తెలిసింది. నవీన్ మొదట ఆ మహిళతో సాన్నిహిత్యం కలిగి ఉన్నాడు.

ఆ తర్వాత అఫ్రిది కూడా ఆమెతో సంబంధాన్ని కొనసాగించాడు. ఈ విషయమై గతంలోనూ పలుమార్లు గొడవ పడ్డారు. అఫ్రిదీ తన ఇంటికి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా.. నవీన్ అతడిపై దాడికి యత్నించాడు. కానీ అతను తప్పించుకుని ఇంటికి చేరుకున్న తర్వాత తన ఇంటి ముందు తన వాహనాన్ని పార్క్ చేశాడు. నవీన్ అతడిని అనుసరించి ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశాడు. దీంతో అఫ్రిదీ అతడిని హత్య చేసి స్థానిక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story