ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య.. 2 నెలలుగా ఇంటి అద్దె కట్టలేక..

దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన వెలుగు చూసింది. బదర్‌పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో 42 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు మైనర్ కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి.

By అంజి  Published on  14 March 2025 7:15 AM IST
Woman, her 2 daughters found dead, Delhi, rent, Crime

ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య.. 2 నెలలుగా ఇంటి అద్దె కట్టలేక..

దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన వెలుగు చూసింది. బదర్‌పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో 42 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు మైనర్ కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, ఇంటి అద్దె చెల్లించకపోవడంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని అధికారులు బుధవారం తెలిపారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచి చూడగా.. కుళ్ళిపోయిన మృతదేహాలు బయటపడ్డాయి. మృతులను పూజ, ఆమె 8, 9 ఏళ్ల కుమార్తెలుగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో మృతదేహాలు 4-5 రోజుల పాతవిగా ఉన్నాయని, వాటి నోటి చుట్టూ తెల్లటి నురుగు ఉందని, ఇది విషప్రయోగం జరిగి ఉండవచ్చని సూచించింది. గత రెండు నెలలుగా ఆ కుటుంబం అద్దె చెల్లించడం లేదని, అందుకే వారు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Next Story