ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. గంజాం జిల్లాలోని బీచ్లో 20 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. గంజాం జిల్లాలోని 20 ఏళ్ల యువతి తన స్నేహితుడితో కలిసి ఆదివారం సాయంత్రం రాజా పండుగను జరుపుకోవడానికి గోపాల్ పూర్ సముద్ర తీరానికి వెళ్లి ఏకాంత ప్రాంతంలో కూర్చుని ఉన్నారు. ఇంతలో మూడు ద్విచక్రవాహనాలపై దాదాపు 10 మంది వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. ఆ గ్రూప్లోని వ్యక్తులు ఇద్దరి ఫొటోలను తీయడం ప్రారంభించారు.
అంతే కాకుండా తీసిన వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసి లీక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత యువతి స్నేహితుడిపై దాడి చేసి, అతడి కాళ్లు, చేతులు కట్టివేసి.. ఆ మహిళను బీచ్ సమీపంలోని ఓ పాడుబడ్డ ఇంటిలోకి ఈడ్చుకెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
ఈ దారుణ ఘటన తర్వాత ప్రాణాలతో బయటపడిన బాధితులు, ఆమె స్నేహితుడు గోపాల్పూర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని జరిగిన ఘటనను పోలీసులకు నివేదించారు. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించిన ఘటనాస్థలాన్ని సందర్శించారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నాం. నిందితులందరూ మేజర్లు, వారిని విచారిస్తున్నాం..అని బెర్హంపూర్ ఎస్పీ శరవణ వివేక్ తెలిపారు.