ఆంధ్ర యువతిపై తమిళనాడు పోలీసులు అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు తమిళనాడు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో ఈ ఘటన చోటు చేసుకుంది.

By -  Medi Samrat
Published on : 30 Sept 2025 6:42 PM IST

ఆంధ్ర యువతిపై తమిళనాడు పోలీసులు అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు తమిళనాడు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మి (18) అనే యువతి టమాటాలు రవాణా చేస్తున్న ఒక గూడ్స్ వాహనంలో ప్రయాణిస్తోంది. సోమవారం రాత్రి ఎంథాల్ బైపాస్ వద్ద రౌండ్స్‌లో ఉన్న సుందర్, సురేశ్ రాజ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ వాహనాన్ని తనిఖీ కోసం ఆపారు.

వాహనంలో ఉన్న యువతిపై అనుమానం ఉందంటూ, విచారణ చేయాలని ఆమెను బలవంతంగా కిందకు దించారు.ఆమెను పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి ఒడిగట్టారు. యువతి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న స్థానికులు గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి కానిస్టేబుళ్లు పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని రక్షించి, అంబులెన్స్ లో తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.

Next Story