ముంబైలోని బాంద్రా స్టేషన్లో రైలులోని ఖాళీ పెట్టెలో మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై రైల్వే పోలీసులు ఒక పోర్టర్ను అరెస్టు చేశారు. శనివారం రాత్రి మహిళ, ఆమె కుమారుడు అవుట్స్టేషన్ రైలులో స్టేషన్కు వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది.
రైలు దిగిన తర్వాత, తల్లీ కొడుకులు ప్లాట్ఫారమ్కు అవతలి వైపు ఉన్న మరో రైలులోకి ప్రవేశించారని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి తెలిపారు. ఆ సమయంలో వీరు ఎక్కిన రైలులో ప్రయాణికులు లేరని, పోర్టర్ మాత్రమే ఉన్నాడని అధికారి తెలిపారు. ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయని అధికారులు తెలిపారు. బాంద్రా రైల్వే పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు చేయడంతో పోర్టర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసు బృందం అతడిని అదుపులోకి తీసుకుంది.
పోలీసులు విచారణ ప్రారంభించి ప్లాట్ఫారమ్లోని పలు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మొదటి రైలు నుండి దిగిన తర్వాత మహిళ, ఆమె కుమారుడు రెండవ రైలులోకి ఎందుకు ప్రవేశించారనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.