వేధింపులు తాళలేక.. భర్త ప్రైవేట్‌ పార్ట్‌ని నరికి చంపిన ఐదో భార్య

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా ఉర్తి గ్రామంలో ఓ వ్యక్తి హత్య దారుణ హత్యకు గురయ్యాడు.

By అంజి  Published on  3 March 2023 11:45 AM GMT
Madhyapradesh, Crime News
ప్రతీకాత్మక చిత్రం

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా ఉర్తి గ్రామంలో ఓ వ్యక్తి హత్య దారుణ హత్యకు గురయ్యాడు. ఆ వ్యక్తిని హత్య చేసింది.. అతడి భార్యనేనని పోలీసులు తెలిపారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. గ్రామానికి చెందిన బీరేంద్ర గుర్జార్ మృతదేహాన్ని ఫిబ్రవరి 21న స్వాధీనం చేసుకున్నారు. మృతుడి గొంతు, జననాంగాలపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయి. హత్య చేసిన తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ భార్య కంచన్‌ గుర్జార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అరుణ్ పాండే తెలిపారు.

అప్పటి నుంచి పోలీసులు ఈ హత్యను బయటపెట్టే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా, మృతుడి దగ్గరి బంధువులతో పాటు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తూ పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మృతుడి భార్య కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించగా.. ఘటన మొత్తం వెలుగులోకి వచ్చింది. హత్య విషయాన్ని వెల్లడించిన మృతుడి బీరేంద్ర గుర్జార్ భార్య కంచన్.. తన భర్త డ్రగ్స్ బానిస అని పోలీసులకు తెలిపారు. మద్యం మత్తులో ఆమెను చాలా హింసించేవాడు.

వేధింపులతో విసిగిపోయిన కంచన్ తన భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నింది. ఫిబ్రవరి 21 రాత్రి తన భర్త బీరేంద్ర ఆహారంలో 20 నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. భర్త గాఢనిద్రలో మునిగిపోవడంతో ఈ దారుణానికి పాల్పడింది. విచారణలో మహిళ మొదట తన భర్తపై గొడ్డలితో చాలాసార్లు దాడి చేసినట్లు తేలింది. ఆ తర్వాత పదునైన ఆయుధంతో భర్త జననాంగాలపై దాడి చేసి హత్య చేసింది. నేరం చేసిన తర్వాత భార్య కంచన్‌ తన భర్త మృతదేహాన్ని బట్టల్లో చుట్టి రోడ్డు పక్కన పడేసింది. అంతేకాదు, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నిందితురాలు మృతురాలి బట్టలు, చెప్పులు కూడా తగులబెట్టింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు బీరేంద్ర గుర్జార్‌కు కంచన్ గుర్జార్ ఐదవ భార్య. అంతకుముందు, బీరేంద్ర వేధింపులతో ఇప్పటికే నలుగురు భార్యలు అతనిని విడిచిపెట్టారు. ఈ వేధింపులతో విసిగిపోయిన కంచన్ తన భర్తను హత్య చేసింది.

Next Story